Apple: భారత ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని హెచ్చరిక ... 1 y ago

featured-image

భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) ఆపిల్ యూజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్, మాక్‌బుక్‌లు, సఫారి వంటి ఆపిల్ ఉత్పత్తుల్లో తీవ్రమైన సాఫ్ట్‌వేర్ లోపాలు ఉన్నాయని, వీటిని హ్యాకర్లు దుర్వినియోగం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇంటెల్ ప్రాసెసర్‌లతో తయారైన మాక్‌బుక్‌లు, ఐఫోన్‌లు, ఐప్యాడ్‌ల యూజర్లకు ప్రధానంగా ఈ ప్రమాదం ఉంది. ఈ లోపాలను దుర్వినియోగం చేసుకుంటే హ్యాకర్లు యూజర్ల సెల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను హ్యాక్ చేసి వారి సమాచారాన్ని దొంగిలించవచ్చు. వారి సిస్టమ్‌ను తమ అదుపులోకి తీసుకోవచ్చు. ఈ లోపాలు ఎగ్జిక్యూషన్ వల్నరబిలిటీ (CVE-2024-44308) మరియు క్రాస్-సైట్ స్క్రిప్టింగ్ (XSS) వల్నరబిలిటీ (CVE-2024-44309) అనే రెండు రకాలుగా ఉన్నాయి. దీనిని నివారించటానికి త‌క్ష‌ణం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయ‌డం, అనుమానాస్ప‌ద లింక్‌లో, ఇమెయిల్‌ల‌ను క్లిక్ చేయ‌కుండా ఉండ‌టం. 

తక్షణం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ : ఆపిల్ తన ఉత్పత్తులకు తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు విడుదల చేసింది. వీటిని వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

అనుమానాస్పద లింక్‌లు, ఇమెయిల్‌లను క్లిక్ చేయవద్దు: హ్యాకర్లు తరచుగా మోసపూరిత ఇమెయిల్‌లు, లింక్‌ల ద్వారా యూజర్లను బలిగొంటారు. అందువల్ల అనుమానాస్పద లింక్‌లు, ఇమెయిల్‌లను క్లిక్ చేయవద్దు.

ప్రతిష్టాత్మక యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి: ఆపిల్ యాప్ స్టోర్ వంటి ప్రతిష్టాత్మక యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి. ఇతర వనరుల నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లు హానికరమైనవి కావచ్చు.

ఈ హెచ్చరికను తీవ్రంగా పరిగణించి, తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం ఆపిల్ యూజర్లను కోరుతోంది. త్వరగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవడం ద్వారా హ్యాకర్ల దాడుల నుంచి రక్షించుకోవచ్చు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD