Stock Market: స్టాక్ మార్కెట్.. వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే 1 y ago
20-02: ఫిబ్రవరి 20న భారత మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. గురువారం నష్టాల్లోనే మొదలైన స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 203 పాయింట్లు (0.27) తగ్గి 75,735 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు (0.086) తగ్గి 22,913 వద్ద క్లోజ్ అయ్యాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టిపిసి లాభాల్లో ఉండగా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మారుతి నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ మొత్తం మీద నష్టాల బాటలోనే సాగింది.