Stock Market: ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్.! 1 y ago
ఫిబ్రవరి 27న భారత ఈక్విటీ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 10.31 పాయింట్లు(0.01) పెరిగి 74,612.43 వద్ద, నిఫ్టీ 2.50 పాయింట్లు(0.01) తగ్గి 22,545.05 వద్ద ముగిసింది. 892 షేర్లు లాభపడగా, 2925 షేర్లు నష్టపోయాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్ నష్టపోయాయి. బ్యాంక్, మెటల్ మినహా అన్ని రంగాలు నష్టపోయాయి. BSE మిడ్క్యాప్ 1%, స్మాల్క్యాప్ 2% తగ్గాయి.