Ranji Trophy: రంజీ ట్రోఫీ ఫైనల్.. విదర్భ 379 ఆలౌట్...! 1 y ago
విదర్భ, కేరళ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఓవర్నైట్ స్కోరు 254/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన విదర్భ 379 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ను మొదలెట్టిన కేరళ రెండోరోజు ఆటముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఆదిత్య సర్వాటె (66 బ్యాటింగ్), సచిన్ బేబీ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అక్షయ్ చంద్రన్ (14), రోహన్ (0) విఫలమవగా.. అహమ్మద్ ఇమ్రాన్ (37) పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ కేరళ ఇంకా 248 పరుగుల వెనుకంజలో ఉంది.