Sana Mir: పాక్ జట్టులో ధోని ఉన్నా ఎం చేయలేడు..సనా మీర్ 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన ఇచ్చింది. దీంతో సొంత ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా పాక్ ఆటతీరుపై మాజీ మహిళా కెప్టెన్ సనా మీర్ స్పందించారు. ఆటగాళ్లు ఎంపిక సరిగా లేదని వ్యాఖ్యానించారు. “ప్రస్తుతం 15 మంది ఆటగాళ్లున్న పాక్ జట్టుకు.. ఎమ్ఎస్ ధోనీ లేదా యూనిస్ ఖాన్ లాంటి వ్యక్తులను కెప్టెన్గా నియమించినా ఈ జట్టుతో ఏమీ చేయలేరు. జట్టును ప్రకటించినప్పుడే నాకు తెలుసు ఈ మ్యాచ్ మన చేజారిపోయిందని బదులిచ్చా” అని సనా మీర్ తెలిపారు.