యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకున్న మిస్ వరల్డ్ క్రిస్టినా..! 1 y ago
TG: యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రాన్ని మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా దర్శించుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా బొట్టు పెట్టుకొని, సంప్రదాయ చీరలో ఆమె కనిపించారు. ఆలయ నిర్మాణ శైలికి క్రిస్టినా ముగ్ధులయ్యారు. నరసింహుడిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాగా చెక్ రిపబ్లికన్ కు చెందిన క్రిస్టినా పిజ్కోవా 2024లో టైటిల్ గెలిచారు. ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు.