MCC: నీట్-పీజీ 2024 అర్హత మార్కుల తగ్గింపు..! 1 y ago
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నీట్-పీజీ 2024 కనీస అర్హత మార్కులను మరోసారి భారీగా తగ్గించింది. ఈ మార్పుతో అన్ని కేటగిరీల అభ్యర్థులకు కనీసం 5 శాతం మార్కులు సాధిస్తే కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మెడికల్ సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండగా, అర్హత మార్కుల తగ్గింపు అనేకమందికి ఊరట కలిగించింది.