వైసీపీ నేతలపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం 1 y ago
AP : వైసీపీ నేతల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు దొంగచాటుగా వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టడం సరికాదన్నారు. ప్రశ్నలు వేస్తున్నారే తప్ప సభకు రావడం లేదన్నారు. దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లి పోవడం ఏంటని ప్రశ్నించారు. సంతకాలు పెట్టిన వారు సభలో కనపడటం లేదన్నారు. ఎన్నికైన సభ్యులు సగర్వంగా సభకు రావాలని పేర్కొన్నారు.